
రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. ఇరువురే ముఖాముఖి హాజరు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో వైసీపీ దుర్మార్గపు ప్రచారం చేయడమే కాకుండా కుల చిచ్చు రేపడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం (ఫిబ్రవరి 4)జరిగిన ఈ భేటీలో అటు లడ్డూ కల్తీ నివేదికపై తదుపరి చర్యలు, ఇటు రాజ్యసభ సీట్ల కేటాయింపు.. రాష్ట్రంలో పాలనపై కూడా ఈ భేటీలో వీరు చర్చించినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువురు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్కు కూడా తగిన సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే కూటమి లక్ష్యంగా వైసీపీ కుట్రలను దీటుగా ఎదుర్కొనేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, క్షేత్ర తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని వైసీపీ అభ్యర్థులకు క్యాడర్ సమన్వయంతో చెక్ పెట్టేలా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలని చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు, పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు.
తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదికపై కూడా వీరిరువురూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయిందని, కేవలం రసాయనాలు, పామాయిల్ కలిపి దీనిని సృష్టించారని సిట్ నిర్ధారించిన నేపథ్యంలో ఈ కల్తీ వ్యవహారంలో సూత్రధారులను వదిలిపెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా.. బాధ్యులందరిపై చట్టప్రకారం చర్య తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు జనసేన, తెలుగుదేశం వర్గాల ద్వారా లెటు వేస్తోంది.
