మేడారం మహా జాతరలో అత్యంత ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు బయలుదేరారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజారులు ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి పడిగెను తీసుకుని భారీ బందోబస్తు నడుమ మేడారం వైపు అడుగులు వేశారు. లక్షలాది మంది భక్తుల కోలాహలం, డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య సారలమ్మ మేడారం చేరుకుంది.
ఈ జాబితాలో రాష్ట్ర మంత్రి సీతక్క. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కూడా కన్నెపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో కోయ గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణం. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కోయ నృత్యంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల రద్దీ దృష్ట్యా కన్నెపల్లి సారలమ్మ గుడి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ పోలీసు భద్రత సుమారు 3.5 నడు మేర కాలినడకన ప్రయాణించి వనదేవతా గద్దెపైకి చేరుకుంది
భక్తుల భద్రతకు 40 మొబైల్ అంబులెన్స్లు
శ్రీ సమ్మక్కసారలమ్మ మేడారం మహాతర సందర్భంగా తక్షణ వైద్య సహాయం అందించిన భక్తులకు ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్ సేవలను విస్తృతంగా ఏర్పాటు చేసింది. మేడారం జాతర ప్రాంతమంతటా మొత్తం 40 ఫస్ట్ రెస్పాండర్ 108 బైక్ అంబులెన్స్లను వివిధ కీలక భాగాలలో మోహరించారు. భారీ సంఖ్యలో ఉన్న ప్రాంతాలనూ వేగంగా చేరుకుని వైద్య సహాయం అందించడానికి వీలుగా ఈ బైక్ అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ మొబైల్ 108 సేవ ద్వారా జ్వరం, తలనొప్పి వాంతులు, అలసట వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు తక్షణ ఫస్ట్ ఎయిడ్తో పాటు అవసరమైన ప్రాథమిక మందులు అందించారు. అలాగే, పరిస్థితి విషమంగా ఉన్న సందర్భాల్లో భక్తులను వెంటనే ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చేశారు. జాతర కాలమంతా ఈ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని అధికారులు ఉన్నారు. భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పగడ్బందీ చర్యలు చేపట్టారు.
