జనవరి 23, 2026 7:48PMన పోస్ట్ చేయబడింది

హత్య కేసుల్లో ఒకే జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీల మధ్య ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రియాసేథ్, హనుమాన్ప్రసాద్ అనే ఖైదీలు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి అభ్యర్థనను కోర్టు మన్నించడంతో పెరోల్పై బయటకు వచ్చిన వారు ఒకటయ్యారు. డేటింగ్ యాప్లో పరిచయం అయిన యువకుడిని ప్రియసేథ్ ఇంటికి పిలిచి, కిడ్నాప్ చేసింది. తన ప్రేమికుడు చేసిన అప్పు తీర్చడానికి ఆమె తన ప్రియుడు, మరో స్నేహితుడితో కలిసి బాధితుడి తండ్రికి ఫోన్ చేసి రూ.10 లక్షలు అందించిన డిమాండ్ చేసింది.
అతను రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చాడు. అయితే యువకుడిని విడుదల చేస్తే విషయం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో అతడ్ని హత్య చేశారు. సూట్కేసులో పెట్టి కొండ ప్రాంతంలో పేడేసిన మృతదేహాన్ని కనుకొన్న పోలీసులు ఆ ముగ్గురిని హత్య చేశారు. ఇక హనుమాన్ ప్రసాద్ ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తమ బంధానికి అడ్డు వస్తున్నారనే కోపంతో మహిళ భర్త, పిల్లలను వారితో కలిసి ఉంటున్న మరో బంధువును వేట కొడవలితో నరికి చంపాడు. ఈ కేసులో నిందితుడు, హనుమాన్ ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సీన్ కట్ చేస్తే జైపూర్లోని సంగనేర్ ఓపెన్ జైల్లో2018 నుంచి శిక్ష అనుభవిస్తున్న ప్రియాసేథ్కి, అదే జైలులో 2017 నుంచి శిక్ష అనుభవిస్తున్న హనుమాన్ప్రసాద్కి ఆరు నెలల క్రితం ప్రేమ పుట్టింది. ఆ అపూర్వ హంతక ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి, పెరోల్ కోంస రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం 15 రోజులు పెరోల్ ఇచ్చింది. రాజస్థాన్లోని అల్వార్లో ఒక్కటైన ఆ హంతక జంట మరికొద్ది రోజుల్లో జైలు గూటికి చేరనుంది.
