పోస్ట్ చేయబడింది జనవరి 14, 2026 2:23PM

ఒక మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనలో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిఎస్ పోలీసులు ఇప్పటికే కీలక అరెస్టులు చేశారు. ఓ న్యూస్ ఛానల్కు చెందిన ఇన్పుట్ ఎడిటర్తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ ఐఏఎస్ అధికారిని తంగ కించపరిచే విధంగా, ఆమె ప్రతిష్టకు భంగం కలిగింది, అవమా నకర వ్యాఖ్యలతో కూడిన కథనాలను ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది కేవలం మీడియా నైతికత ఉల్లంఘన మాత్రమే కాకుండా, నేరంగా కూడా పరిగణిస్తుందని సిఎస్ అధికారులు స్పష్టం చేశారు.
44 యూట్యూబ్ ఛానల్పై కేసులు
ఈ వ్యవహారంలో టెలివిజన్ ఛానల్తో పాటు 44 యూట్యూబ్ ఛానల్ కూడా మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వీడి యోలు, చర్చలు, అభ్యంత రాల ప్రసార ప్రసారాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయా యూట్యూబ్ ఛానల్పై నియంత్రణ చర్యలకు సిసిఎస్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… అధికారిని అవమానించే ప్రయత్నం చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు వురు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులను గుర్తించిన అధికారులు.
సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఫుట్ప్రింట్స్ ఆధారంగా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుల వివరాలను సేకరించిన పనిలో పడ్డ సిఎస్ఎస్ పోలీసులు, వారిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పటిష్టంగా ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చ రించారు. ఈ ఘటనపై సిసిఎస్ పోలీసుల దూకుడుతో పాటు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వీడియోలను తొలగించగా, మరికొందరు తమ ఛానల్ను తాత్కాలికంగా మూసివేసినట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డిలీట్ చేసిన కంటెంట్ కూడా డిజిటల్ ఆధారాల రూపంలో తమ వద్ద ఉందని పోలీ సులు చెబుతున్నారు.
మీడియాకు సిఎస్ హెచ్చరిక
ఈ సందర్భంగా సిసిఎస్ పోలీసులు మీడియా సంస్థలకు కీలక హెచ్చరికలు చేశారు. వారి గౌరవం, ముఖ్యంగా మహిళా అధికారుల ప్రతిష్టను దెబ్బ తీసేలా అసత్య కథనాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛ పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఖండించారు.జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన సుచించారు.జర్నలిస్టుల అరెస్ట్ను వెంటనే ఆపాలంటూ సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్ రెడ్డికి పోలీసులు ఫిర్యాదు చేశారు.మహిళా ఐఎస్ఏఎస్పై ఇన్స్టిట్యూషన్ సభ్యుని కథనాలు ప్రసారం చేశారు. తీసుకున్న విషయం. మరోవైపు ప్రముఖ న్యూస్ ఛానల్పై సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆఫీసులో సర్వర్లు లాగేసి, కంప్యూటర్లు సీజ్ చేశారు.
