పోస్ట్ చేయబడింది జనవరి 9, 2026 3:08PM
.webp)
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది. డీజీపీ నియామకానికి అనుమతిని సస్పెండ్ చేయాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు డీజీపీగా శివధర్రెడ్డి కొనసాగడంపై తాత్కాలిక అడ్డంకులు తొలగినట్లయ్యాయి.ఈ సందర్భంగా కోర్టుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నియామకానికి సంబంధించి సాధారణ ప్రాసెస్లను తప్పనిసరిగా నాలుగు వారాల్లో పూర్తి చేయడం. ముఖ్యంగా యూఎస్ఎస్ ద్వారా జరగాల్సిన నియామక ప్రక్రియను నిర్ణీత గడువులోగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యూపీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత వివరాలతో కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయడానికి కూడా హైకోర్టు సూచించింది. నియామకంలో విధివిధానాలు, నిబంధనలు పూర్తిగా పాటించాలన్న అంశంపై కోర్టు స్పష్టతనిచ్చింది. డీజీపీ నియామక వ్యవహారంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ప్రభుత్వం యూపీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికి, డీజీపీ శివధర్రెడ్డికి ప్రస్తుతం హైకోర్టు నుంచి ఊరట లభించడం, తుది నియామకం విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ కేసుపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి.
