స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఆమె తాజా ట్రిప్ మరింత బలాన్నిచ్చింది. ఇటీవల తన స్నేహితురాళ్లతో కలిసి శ్రీలంక వెళ్లిన రష్మిక, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇది విజయ్ కచ్చితంగా పెళ్లికి ముందు చేసుకుంటున్న బ్యాచిలరేట్ పార్టీ అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. తన బిజీ షెడ్యూల్ నుంచి రెండు రోజుల విరామం తీసుకుని, తన గర్ల్ గ్యాంగ్తో కలిసి శ్రీలంకలోని ఓ అందమైన ప్రదేశానికి వెళ్లిన రష్మిక ఇన్స్టాగ్రామ్లో ప్రదర్శన. “ఎంత చిన్న ట్రిప్ అయినా సరే, అమ్మాయిలతో చేసే ప్రయాణాలే ఉత్తమమైనవి” అని తన పోస్ట్లో ఆమె రాసుకొచ్చింది. రష్మిక దీనిని ఓ సాధారణ ట్రిప్గా ఉన్నప్పటికీ, అభిమానులు మాత్రం దీనికో ప్రత్యేక అర్థం తీసుకున్నారు. ఆమె పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే కామెంట్ల సెక్షన్ నిండిపోయింది. “ఇది బ్యాచిలరేట్ పార్టీనా?” అని చాలామంది ప్రశ్నించగా, “విజయ్తో పెళ్లి ఎప్పుడు?” అంటూ మరికొందరు నిలదీశారు. “అబద్ధం చెప్పకు, ఇది నీ బ్యాచిలరేట్ పార్టీయే కదా” అంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు. తాజాగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీటీవీ కథనం ప్రకారం, వీరి నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్ 3న జరగ్గా, 2026 ఫిబ్రవరి 26న ఉదయ్పూర్ వేదికగా వివాహం జరగనుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే రష్మిక శ్రీలంక ట్రిప్పై ఈ స్థాయిలో చర్చ జరిగింది.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్కోడ్కు గుడ్బై చెప్పండి.. భారత్లో కొత్తగా డిజి పిన్
