డిసెంబర్ 27, 2025 1:48PMన పోస్ట్ చేయబడింది

వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తప్పుబట్టారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడం లేదని స్ఫష్టం చేశారు. తన గురించి దువ్వాడ ఎందుకు మాట్లాడాడని ఆయన ప్రశ్నించారు. తనకు దువ్వాడతో ఎటువంటి విభేదాలు లేవన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడం వల్లనే తమవాళ్లు నిరూపించుకున్నారని.
కింజారపు అప్పన్నతో తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు. తనకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఎటువంటి విభేదాలు లేని ధర్మాన క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నారంటూ. అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వద్ద హైవేపై కారు ఆపి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
తాను భయపడే వ్యక్తి కాదన్నారు. అయితే ఈ ఆరోపణలను కృష్ణదాస్ ఖండించారు. ఈ విధంగా మాధురి, కింజరాపు అప్పన్నల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆలోని ఆడియో మాటలు వాస్తవమేనని కృష్ణదాస్ చెప్పడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
