కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమైంది. బూత్-స్థాయి అధికారులు (బీఎల్ఓ) సేకరించిన ఫారాల డిజిటైజేషన్ సరళిని బట్టి, సుమారు 43.30 లక్షల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి మినహాయించుకునేందుకు ఈసీఐ అంచనా వేసింది. ఈ ముసాయిదా జాబితాను ఈ నెల 16న ప్రచురించనున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖ్య కార్యాలయ వర్గాల ప్రకారం సోమవారం సాయంత్రం వరకు డిజిటలైజేషన్ ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 27 నాటికి బెంగాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,66,37,529గా ఉంది. తొలగించనున్న 43.30 లక్షల పేర్లలో అత్యధికంగా 21.45 లక్షల మంది మరణించిన ఓటర్లు ఉన్నారు. దాదాపు 15.10 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వచ్చినవారు కాగా, 5.5 లక్షల మంది ఆచూకీ లభించని వారుగా పేర్కొన్నారు. బోగస్ లేదా నకిలీ ఓటర్ల సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, రాష్ట్రంలోని 2,208 పోలింగ్ బూత్లలో మరణించిన, నకిలీ లేదా వలస వెళ్లిన ఓటరు ఎవరూ లేరని గుర్తించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్ని బూత్లలో ఒక్క లోపం కూడా లేకపోవడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ బూత్ల నుంచి సేకరించిన ఫారాలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందించారు. నవంబర్ 26, 27, 28 తేదీల్లో కేవలం మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1.25 కోట్ల ఫారాలు నమోదు కావడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ మూడు రోజుల్లో నమోదైన ఫారాలపై ఆడిట్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని నిర్ణయించారు
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్కోడ్కు గుడ్బై చెప్పండి.. భారత్లో కొత్తగా డిజి పిన్
