డిసెంబర్ 22, 2025 8:38PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దని ఇదే బీఆర్ఎస్ పాలసీ అని మంత్రి శ్రీధర్బాబు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపరచడం మంచిది కాదు. ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హితవు పలికారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల ఎమ్మెల్యేలు అబద్ధమైతే…. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు కూడా గ్లోబల్ సమ్మిట్కు రావడం అబద్ధమని శ్రీధర్బాబు ప్రశ్నించారు.
మీలాగా మాకు ‘గాల్లో మేడలు’ కట్టడం రాదు. అరచేతిలో స్వర్గం చూపించడం అసలే రాదు. ‘అబద్ధాల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి గుర్తు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్’ మీద పేటెంట్ మీదా…? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు…? ఒక ప్రణాళిక ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్ ను పూర్తి చేశామని చెప్పారు. అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చాం. దేశంలో ఇదే మొట్టమొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్. కేంద్రం నుంచి మా హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకొచ్చామని చెప్పారు.
వాస్తవాలు మాట్లాడితే… ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్ లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏకో సిస్టం అభివృద్ధికి పునాదులే కారణం. అవునా… కాదా..? మంత్రి ప్రశ్నించారు. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచంలో మూడొంతుల వ్యాక్సిన్లు తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి
