డిసెంబర్ 16, 2025 2:28PMన పోస్ట్ చేయబడింది

మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన జరిగింది. ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలంటే పంచప్రాణాలు…. పిల్లలను అపురూపంగా పెంచుతారు. ఏ చిన్న దెబ్బ తాకినా కూడా విలవిల్లాడుతోంది. అటువంటిది ఓ తల్లి కన్నకూతురిని మూడో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేసిన ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది…మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో నివాసముంటున్న మోనాలిసా అనే మహిళఏడు సంవత్సరాల్లో తన చిన్నారి కూతురు షారోని మేరిని ఒక్కసారిగా బిల్డింగ్ పైనుంచి కిందకు తోసివేసింది.
పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు బయటికి వచ్చి చూడగా చిన్నారి రక్తమడుగులో పడి ఉంది… అది గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తర లించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న షారోని మేరి మృతి చెందింది. ఈ ఘటనపై సమా చారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తల్లి మోనాలిసాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడన్న అంధ నమ్మకంతో తన పాపను చంపానని తల్లి చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్య చకితులయ్యారు..అంధవిశ్వాసాలే ఈ ఘోరానికి కారణమా? లేక తల్లి మానసిక స్థితి ఎలా ఉంది అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం…ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కన్నబిడ్డపై తల్లి చేసిన అమానుష చర్యపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
