అనంత్ పేరులో మావోయిస్టు పార్టీ ప్రకటన
పోలీసుల అదుపులోనే దేవ్జీ ఉన్నాడని వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం, వైజాగ్, రాయ్పూర్, నవంబర్ 28 (ఈవార్తలు): ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. సంవత్సరం సందర్భంగా జనవరి 1న సాయుధ విరమణ కొత్త భాగం. అందరూ కలిసి ఒకేసారి లొంగిపో ప్రదర్శించారు. ఎంజీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదలైంది. ‘ఆయుధ విరమణ అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదు. సంఘర్షణకు సరైన సమయం కాదు. అధిక ప్రాధాన్యత ఇచ్చే సర్కార్తో వెళ్తాం’ అని పేర్కొన్నారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్న మావోయిస్టులు ఇటీవల లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగర్లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటించామని, తాజాగా ఈ నెలాఖరున మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మరోవైపు, మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం పార్టీకి చీఫ్గా కొనసాగుతున్నాడని తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి విప్ పేరుతో 22న విడుదలైన లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ‘మాయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్జీతో పాటు మరో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలి. అదేవిధంగా మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లకు నిరసనగా 30న భారత్బంద్ పాటించాలి. అక్కడి ప్రాంతంలోని సహజ వనరులను అధికార్లకు దోచిపెట్టేందుకే అక్కడి ఆదివాసీలపై ప్రభుత్వం దౌర్జన్య చర్యలకు దిగుతోంది. గిరిజన చట్టాలు అమలయ్యే రిజర్వ్ ఫారెస్ట్లో క్యాంపుల ఏర్పాటు, రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం లక్షలాది చెట్లను ప్రభుత్వం నరికివేస్తోంది’ అని ప్రకటించారు.
ఛత్తీస్గఢ్లో 10 మంది లొంగుబాటు
ఛత్తీస్గఢ్లో మరో కీలక మావోయిస్టు నేత లొంగిపోయారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు చైతూ అలియాస్ శ్యామ్ దాదా సహా పది మంది మావోయిస్టులు భద్రతాదళాల ఎదుట శుక్రవారం లొంగిపోయారు. శ్యామ్ దాదాపై రూ.25 లక్షల రివార్డు ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టేసేందుకు 2013లో జరిగిన దాడిలో శ్యామ్ దాదా మాస్టర్మైండ్ అని అధికారదస్త్రాలు చెబుతున్నాయి. సీపీఐ (మావోయిస్టు) దర్భా డివిజన్కు కొన్నేళ్ల పాటు శ్యామ్ దాదా నేతృత్వం వహించారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో శ్యామ్ ఒకరని పోలీసులు తెలిపారు. శ్యామ్ దాదాతో పాటు డివిజనల్ కమిటీ సభ్యులు సరోజ్ అలియాస్ ఊర్మిళ (రూ.8 లక్షల రివార్డు), ఏరియా కమిటీ సభ్యులు భూపేష్ అలియాస్ సహాయక్ రామ్, ప్రకాశ్, కమలేష్ అలియాస్ ఝిత్రూ, జనని అలియాస్ రైమతి కశ్యప్, సంతోష్ అలియాస్ సన్నూ, నవీన్, పార్టీ మెంబర్లు రామ్షీ. వీరిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. సుఖ్మాలో సీనియర్ పోలీసులు, జిల్లా అధికారులు ముందు వారు ఆయుధాలను త్యజించారని చెప్పారు. డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా దళాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరుగుతున్న నక్సల్ ఏరివేత చర్యలు, పలువురు సీనియర్ మావోయిస్టు నేతల లొంగుబాటు, ప్రభుత్వం పదే పదే చేస్తున్న సూచనలు ఈ పది మంది లొంగుబాటుకు దారితీశాయని పోలీసులు తెలిపారు.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్కోడ్కు గుడ్బై చెప్పండి.. భారత్లో కొత్తగా డిజి పిన్
