నవంబర్ 10, 2025 6:02PMన పోస్ట్ చేయబడింది

వైసీపీ అధినే జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ శాసన సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై సభాపతి స్పందించారు. జగన్కు సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన సమయమే ఇవ్వాలని స్ఫష్టం చేశారు. ఆయన మీడియా ముందు కాకుండా అసెంబ్లీ కొచ్చి మాట్లాడాలని హితవు పలికారు.
నా ముందు అధ్యక్ష అనడం ఇష్టం లేక అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు జగన్ తప్ప.. కానీ అసెంబ్లీకి మాత్రం రావడం లేదని స్పీకర్ తెలిపారు. గత జగన్ హయాంలో ఏపీ సర్వనాశనమైందని తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెదపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజుల పాటు ఉంటే మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చండీయాగ, నవగ్రహ యాగాల్లో సభాపతి అయ్యన్న సోమవారం ఉంటుంది. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారని. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబు చిత్తశుద్ధిగా పని చేస్తుంటే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
