నవంబర్ 8, 2025 2:22PMన పోస్ట్ చేయబడింది
.webp)
తిరుపతి జిల్లా, మంగళంలో శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలను అధికారులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారిగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులను పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం ఎర్ర చందనం ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని రెవెన్యూశాఖ అధికారులను తీసుకున్నారు. స్థానిక అధికారులతో కలిసి పవన్ మొక్కలు నాటారు.
అడవిలో నాలుగు డిప్యూటీ సీఎం పవన్ చేశారు. రెండు ప్రాంతాల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు.ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుండి మొత్తం ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున నిలబడి, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు.
