నవంబర్ 5, 2025 12:08PMన పోస్ట్ చేయబడింది
.webp)
ఆంధ్రప్రదేశ్ లో.. ఆ మాటకొస్తే దేశంలోనే ఇప్పుడున్న అగ్రశ్రేణి రాజకీయ నేతలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అందరి కంటే సీనియర్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. సీనియారిటీలోనే కాదు.. ఆయన స్టేచర్, అనుభవం, దర్శనికతలలో మేటిగా నిలుస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆయనకు సాటి రాగల నేత కాగడ పెట్టి వెతికినా కనబడరు. అయితే ఆయన అంత సీనియారిటీ లేకపోయినా, యువనేత, మంత్రి నారాలోకేష్ ను చంద్రబాబుతో పోటీ పడుతున్న నేతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగువన్ 2023 జులైలో నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వేలోనే చంద్రబాబు తరువాత బెస్ట్ ఫాలోయింగ్ ఉన్న ఏపీ ప్రజానేతగా నారా లోకేష్ నిలిచారు. నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగడం వెనక కఠోర శ్రమ ఉంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. రాజకీయంగా లోకేష్ తొలి అడుగు వేయకుండానే ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. బాడీషేమింగ్, ఆయన నడక, మాట ఇలా కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రత్యర్ధులు శృతి మించి ఆయన్ను తూలనాడారు.
లోకేష్ ఆహారం, ఆహారం ఇలా ప్రతి విషయంలోనూ ఆయనను గేలి చేశారు. రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వా నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు. ఆ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఇదీ నాడు తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వేలో తేలిన వాస్తవం.
అయితే అప్పటికి ఆయనకు జనం బ్రహ్మరథం పట్టడానికి అప్పటికి ఆయన చేస్తున్న యువగళం పాదయాత్ర ప్రధాన కారణమని చెప్పాలి. అయితే తెలుగువన్ ఆన్ లైన్ సర్వే నిర్వహించి రెండేళ్లు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టి కూడా 16 నెలలు గడిచిపోయింది. పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు నారా లోకేష్ అత్యంత కీలకం. ఈ స్థితిలో ఆయనలో, ఆయన వ్యవహార శైలిలో ఏదైనా మార్పు ఉందా? అంటే పరిశీలకులు అబ్బో చాలా మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మరింతగా ప్రజలతో మమేకమవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల విషయంలో ఆయన చూపే చొరవ.. అక్కడికక్కడే తీసుకునే నిర్ణయాలతో ప్రజల నాయకుడిగా మరింతగా ఎదిగారని చెప్పారు.
రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వరుస విదేశీ పర్యటనల్లో క్షణం తీరిక లేకుండా సమస్యల సమస్యలపై దృష్టి సారిస్తూ లోకేష్ ఒకే సమయంలో అటు పెట్టుబడుల వేటలోనూ, ఇటు ప్రజా పరిష్కారం విషయంలోనూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు తాను రూపొందించుకున్న ప్రజా దర్బార్ లోకేష్ శ్రద్ధగా ఉన్నారు. మంగళవారం (అక్టోబర్ 4) మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బార్ లోకేశ్ ను కలిసేందుకు వచ్చిన జనంతో అక్కడ అర కిలోమీటర్ కు పైగా క్యూ లైన్ ఏర్పడింది.ఇది తమ సమస్యల విషయంలో లోకేష్ పట్ల ప్రజల పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ప్రజాదర్భార్ లో లోకేష్ తో వ్యక్తిగతంగా ప్రసంగించి తమ సమస్యలు తెలుపుకోవడానికి వచ్చిన వేలాది మందిని ఆయన నిరాశపరచలేదు. దాదాపు నాలుగువేల మందిని కలిసి వారి సమస్యలను ప్రత్యక్షంగా విని వాటి విషయంలో భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత జూన్ 15, 2024న లోకేష్ ఈ ప్రజాదర్బార్ ను కలిగి ఉంది. ప్రజల నుంచే నేరుగా వారి సమస్యలు తెలుసుకుని వాటిని వేగంగా పరిష్కరించే నాయకుడిగా లోకేష్ లోకేష్ ఈ కార్యక్రమం ద్వారా జనాలకు మరింత చేరువవుతున్నారు.
