నవంబర్ 5, 2025 2:56PMన పోస్ట్ చేయబడింది
.webp)
హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ పోటీ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో సీసీ చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు రాహుల్ ప్రకటించారు. హరియాణలో ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ ఓటు ఉందని. డూప్లికెట్ ఓట్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాప్ట్వేర్ ఉంది. అయినా 5 లక్షల నకిలీ ఓట్లు ఎలా వచ్చాయని రాహుల్ ప్రశ్నించారు.
బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కు కూడా 22 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆమె ఫోటో ఒకటే అయినప్పటికీ సీమ, స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్లు, వయస్సులు, జెండర్లతో 22 ఓట్లను సృష్టించారు. హర్యానా ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచించినప్పటికి ఫలితాలు మారాయి. హెచ్ ఫైల్స్ అనే పదం గురించి ప్రస్తావించారు.ఓటు హక్కు నమోదుకు హౌస్ నెంబర్ తప్పనిసరి కావడంతో ఇళ్లు లేని నిరుపేదలకు ఇబ్బంది కలుగుతోందని ఈసీ ఓ కొత్త రూల్ తీసుకొచ్చిందని రాహుల్ గుర్తు చేశారు.
ఇల్లు లేని నిరుపేదలు ఓటు హక్కు నమోదు సమయంలో ఇంటి నెంబర్ ను ‘జీరో’గా చూపే వెసులుబాటు కల్పించాలని చెప్పారు. అయితే, ఈ విధానం నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలంటే సదుద్దేశం కన్నా అక్రమ ఓటర్లు, ఫేక్ ఓటర్లకు జాబితాలో చోటు కల్పించాలంటే దురుద్దేశమే ఉండదని రాహుల్ పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో జరిపిన ఈ పరిశీలనలో సంచలన విషయాలు బయటపడ్డాయని రాహుల్ చెప్పారు.హర్యానా చరిత్రలో తొలిసారిగా, సాక్షి బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదని, ఇది ఇంతకు ముందు జరగలేదని, కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేసిందని రాహుల్ చెప్పారు. అయితే ఎన్నికల కమీషన్లు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి.
