నవంబర్ 5, 2025 9:12AMన పోస్ట్ చేయబడింది
.webp)
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మైనర్లను సైతం ప్రచారంలో వాడారంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై ఫిర్యాదు చేశారు. యూసుఫ్ గూడ కు చెందిన షఫీయుద్దీన్ అనే ఈ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.
ఈ నెల 2న బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహించిన కేటీఆర్ ముఖ్యమంత్రి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, మైనర్ బాలికను వేదికపైకి తీసుకొచ్చి రాజకీయ ప్రేరేపిత, భావోద్వేగ ప్రకటనలు చేసి, ఓటర్లలో సానుభూతిని ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైలేజ్ ల కోసం మైనారిటీ తీరిన పిల్లలను ప్రచార సభలకు తీసుకువెళుతున్నారంటూ షపీవుద్దీన్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసు కోవాలని.
