నవంబర్ 3, 2025 11:11AMన పోస్ట్ చేయబడింది

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారికంగా ఇప్పటి వరకూ 19 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఆర్టీసీ తరుపున మరో రూ. 2 లక్షల క్షతగాత్రులకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోంది. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. 19 మందిలో 13 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తాం” అని మంత్రి తెలిపారు. ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రమాద కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం. అదేవిధంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందజేస్తుంది.
