నవంబర్ 1, 2025 11:09AMన పోస్ట్ చేయబడింది

ఇలా అజారుద్దీన్ ని కేబినెట్లో చేర్చుకుని.. అలా ఆయన్ను తన ప్రచార రథం ఎక్కించి.. జూబ్లీ హిల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మ్యాజిక్ చేశారు. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 31) నిర్వహించిన రోడ్తో ఒక మ్యాజికల్ షో ప్రదర్శించబడింది. ఒక వైపు అజారుద్దీన్ ను పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి రోడ్ షో నియోజకవర్గంలోని మైనారిటీలను ఆకర్షించింది. అదే సమయంలో మధ్య మధ్యలో పిజేఆర్ కుమార్తె విజయరెడ్డిని సైతం తన ప్రచారంలో ఒక భాగం చేస్తూ రేవంత్ రెడ్డి ఓటర్లను ఆకట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు. అక్కడితో ఆగకుండా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న సెటిలర్స్ ను మెప్పించేలా.. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన చేసి.. దటీజ్ రేవంత్ అనిపించుకున్నారంటున్నారు.
గతంలో మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ రేవంత్ కేబినెట్లో మంత్రిగా చేరారు. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం ఆయన చేత రాజ్ భవన్ లో గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే సాయంత్రం అజరుద్దీన్ ను వెంటపెట్టుకుని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో రోడ్ షోలో అజరుద్దీన్ ఇక్కడ ఒక సారి పోటీ చేసి ఓడిపోతే ఆయన్ను ఎమ్మెల్సీ చేసి అటు పిమ్మట మంత్రిగానూ ప్రమాణం చేసి.. మీ ముందుకు తెచ్చానంటూ ఈ సందర్భంగా రేవంత్ ప్రజలకు చెప్పారు. అజార్ కూడా నవీన్ యాదవ్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు.
ఇక పీజేఆర్ తనయ విజయరెడ్డి సంగతి సరే సరి. అప్పట్లో మాస్ లీడర్ పీ. జనార్ధన్ రెడ్డి చనిపోయినపుడు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వైరుధ్యలను పక్కన పెట్టి ఆయన కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేస్తానంటే.. ఇదే కేసీఆర్ పీజేఆర్ భార్యా పిల్లల్ని మూడు గంటల నిలలతో పాటు ఒట్టి చేతులతో పంపించేశారని గుర్తు చేశారు. అందుకు సాక్ష్యం విజయారెడ్డేన రేవంత్ ఆమెను పక్కన పెట్టుకుని మరీ చెప్పడం ద్వారా ప్రజల సెంటిమెంట్ ను టచ్ చేశారు.
ఎక్కే ఫ్లైటు దిగే బెంజికార్లే జీవితంగా ఇన్నాళ్లు బతికిన బిల్లా రంగాలు ప్రస్తుతం ఆటోలో తిరుగుతూ.. మిమ్మల్ని మాయ చేయడానికి వస్తున్నారనీ.. సొంతింటి రేవంత్ ఆడబిడ్డనే రోడ్డున పడేసిన వీరు.. మాగంటి సునీత కార్చే కన్నీళ్ల ద్వారా గెలవాలని మోసగాళ్లని చూశారు. తెలియజేసారు.
ఇక మైత్రీ వనంలో అందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి విగ్రహం పెట్టే బాధ్యత నవీన్ కి అనిల్ కి అప్పగించానని.. తానే స్వయంగా వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నని మాటిస్తూ… ఇటు సెటిలర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇటు అజారుద్దీన్ ద్వారా మైనార్టీ ఓట్లను, ఆపై ఈ ప్రాంతంలో మాస్ లీడర్గా ఉన్న పీజేఆర్ అభిమానగణాన్ని.. ఇక కృష్ణాన గర్ వంటి ప్రాంతాల్లో నివసించే సెటిలర్లను ఆకట్టుకునేలా రేవంత్ రోడ్ షో సాగింది. గ’తంలో ఏ ముఖ్యమంత్రి కూడా మీ మొహం చూసిన వారు కాదని.. ఇదే నియోజవకర్గం నుంచి మూడు సార్లు గెలిచిన గోపీనాథ్ ఒక్క పేపర్టంటే ఒక్క సారి కూడా అసెంబ్లీలో ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడింది రేవంత్ లేదని.. ఆపై ఆయన ఈ పదహారునెలల్లో సీఎం ఈ నియోజకవర్గనికి కూడా లేదని అన్నారు.
అలాగని మాగంటి కుటుంబంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. ఆ ఫ్యామిలీ పట్ల సానుభూతి అలాగే ఉందని.. అయితే.. గ’త మూడు పర్యాయాలతో పాటు ఏమీ చేయలేని వారు నాలుగోసారి గెలిపిస్తే మాత్రం ఏం చేయగలరనీ ప్రశ్నించారు. గత రెండు నెలలుగా ఈ నియోజక వర్గానికి తమ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఇచ్చింది కాబట్టి.. ఇక్కడ గల్లీ గల్లీ తెలిసిన వ్యక్తి.. నవీన్ యాదవ్ ని గెలిపించి.. నాకు సిటీలో ఒక కుడి భుజాన్ని అందజేయాల్సిందిగా సీఎం రేవంత్. మరి సీఎం రేవంత్ అభ్యర్ధన ఇక్కడి ఓటర్లు మన్నిస్తారా.. లేదా? తెలియాలంటే నవంబర్ 14 వరకూ వేచి చూడాల్సిందే.
