పోస్ట్ చేయబడింది అక్టోబర్ 30, 2025 12:31PM

సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అజరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా జూబ్లీ బైపోల్లో ప్రయోజనం పొందుతామని కాంగ్రెస్కు సొంత పార్టీ నుంచే కాకుండా, కాంగ్రెస్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముందుగా కాంగ్రెస్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా తనకు కేబినెట్ బెర్త్ ఇవ్వాలంటూ ఊరూవాడా ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అజరుద్దీన్ కు మంత్రి పదవి వచ్చిన వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జరిగితే తాను పార్టీ వీడడానికి కూడా వెనుకాడబోనని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. సరే కాంగ్రెస్ లో ఇలాంటి అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులు సహజమేనని లైట్ తీసుకున్నా.. బీజేపీ ఏకంగా అజరుద్దీన్ కు మంత్రిపదవిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
నిజానికి అజరుద్దీన్ కు రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందన్న మాట వాస్తవమే అయినా, ఇందుకు శుక్రవారం (అక్టోబర్ 31) ముహూర్తం అని గట్టిగా వినిపిస్తున్నా… దీనికి సంబంధించిన అదికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే బీజేపీ ఆజరుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకునే కార్యక్రమం వాయిదా పడేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకులు పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి గురువారం (అక్టోబర్ 30) ఉదయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జూబ్లీ ఉప ఎన్నికకు ముందు అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడమంటే.. ఈ ఎన్నికల్లో ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని బీజేపీ అంటోంది. చూడాలి మరి ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలా ఉంటుందో?
