అక్టోబర్ 22, 2025 9:20PMన పోస్ట్ చేయబడింది

అచ్చం సినిమాలోనే తెలంగాణ పోలీసులు ఈగల్ టీం తో కలిసి జైంట్ ఆపరేషన్ నిర్వహించి గంజాయి ఉన్న ఓ వాహనాన్ని రాత్రంతా ఫాలో చివరకు చెక్ పెట్టి… నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు…
లాగా తెలంగాణ పోలీ సులు చేసిన చేజింగ్ సీన్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. గంజాయి భారీ ఎత్తున సరఫరా చేసేందుకు వీలుగా విశ్వసనీ యమైన సమాచారం రావడంతో ఖమ్మం జిల్లా నార్కోటిక్ పోలీసులు అప్రమత్తమై ఈగల్ టీం తో కలిసి జైంట్ ఆపరేషన్ నిర్వహించి… ఆంధ్ర– ఒరిస్సా సరిహద్దు ప్రాంతా ల్లో నిఘా పెట్టారు.
ఈ నేపథ్యంలోనే అధికా రుల వాహనాల తనిఖీలు జరిగాయి. అయితే దీపావళి పండుగ సందర్భంగా పోలీ సుల తనిఖీల్లో నుంచి ఈజీగా తప్పించుకోవచ్చని నిందితులు భావించారు. ఈ నెల 21వ తేదీన రాత్రి అతిపెద్ద ట్రక్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లో గంజాయి పెట్టుకొని రవాణా చేస్తున్నారు. అక్కడ వాహనాల తనిఖీలు చేస్తున్న అధికారు లకు ఒక వాహనం అనుమానంగా కనిపించింది.
హెవీ వాహనం ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా నుండి ఉత్తరప్రదేశ్లో వారణాసికి బయలుదేరినట్లుగా నిర్ధారణ అయింది. అయితే వీరు గంజాయిని తీసుకొని తెలంగాణ గుండా ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు రాత్రం తా హెవీ వాహ నాన్ని చేజ్ చేస్తున్నారు… పోలీసులు తమను చేజ్ చేసినట్లు తెలుసుకున్న ఈ ముగ్గురు వేరే వాహనం దారి మళ్లించి… దారిలో వెళ్తున్నారు. అయితే ఈ విషయం వెంటనే తెలంగాణ పోలీసులు ట్రాకింగ్ ద్వారా రాంచి ఎన్సీబీ కి సమాచారం ఇచ్చింది.
రాంచి ఎన్సీబీ అధికారులు వెంటనే అప్రమత్తమై స్మగ్లర్లు వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసి.. చివరకు జార్ఖండ్ లోని రాంచి-రూర్కెలా రోడ్డులోని సిమ్ దేగా వద్ద 10 టైర్ల హెవీ గూడ్స్ వాహనాన్ని అడ్డుకున్నారు. అనం తరం అధికారులు హర్యానాకు చెందిన నసిమ్ కమ్రుద్దీన్ (30) ను పట్టుకోగా హర్యానాకు చెందిన ముష్తాక్ ఖాన్, ఆరిఫ్ ఈ ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అమర్చారు.. అధికారులు నసీమ్ కమ్రుద్దీన్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 500 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
