అక్టోబర్ 18, 2025 7:59PMన పోస్ట్ చేయబడింది

హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన నియామక పత్రాలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేవారు, ఉద్యోగులు తమ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అదే జరగకపోతే వారి జీతంలో కోత విధించి తల్లిదండ్రులకు అందజేస్తామని చెప్పారు. త్వరలోనే చట్టం తెస్తామని సూచించింది. విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సీఎం పేర్కొన్నారు.
అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని ముఖ్యమంత్రి. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి ఆయన పేర్కొన్నారు. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేయడం తప్ప గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందని సీఎం ప్రశ్నించారు. మిమ్మల్ని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది.
ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ అని ముఖ్యమంత్రి అన్నారు. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలని. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోకూడదని నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
