అక్టోబర్ 15, 2025 2:28PMన పోస్ట్ చేయబడింది

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన కల్వకుంట్ల కవిత పార్టీ పెడతారా? పెట్టరా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది లేని ప్రశ్నగా ఉన్నా.. కవిత ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నారంటున్నారు పరిశీలకులు. ఆమె సొంతంగా పార్టీ పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారనీ, అందుకే ఈ నెల చివరి వారంలో ఆమె తెలంగాణలోని అన్ని జిల్లాలనూ కవర్ చేసే విధంగా ఒక యాత్ర చేపట్టబోతున్నారనీ అంటున్నారు. ఆమె యాత్రను ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఇంతకీ ఆ యాత్ర ఎలా జరగనుంది? ఆ డీటైల్స్ ఏంటని చూస్తే..
కల్వకుంట్ల కవిత తాను త్వరలో చేపట్టబోతున్న యాత్రలో ఎక్కడా కూడా తన తండ్రి కేసీఆర్ ఫొటో కనిపించడం లేదు. ఆవిడ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితరులతో ఒక పోస్టర్ను తీసుకొచ్చారు.
ఇలా ఎందుకు? అంటే.. తండ్రి కేసీఆర్ తన అన్న కేటీఆర్ తో ఉన్నారు. ఎంత కాదనుకున్నా వారిద్దరూ ఒక జట్టు. దీనిని మార్చడం అసాధ్యం. ఆమె సొంతంగా, స్వతంత్రంగా అడుగులు వేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకోసం అవసరమైతే.. ఇంత కాలం తన పేరు ముందు ఉంచుకున్న పుట్టింటి ఇంటి పేరు కల్వకుంట్లను కూడా వద్దనుకునేలా ఆమె అడగడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే పార్టీ నుంచి భౌతికంగా బయటకు రావడం ఆగకుండా.. కల్వకుంట్ల కుటుంబానికి కూడా దూరం జరిగిపోయింది.. తాను నేటి మహిళను, కావలసినంత ఆత్మవిశ్వాసం ఉందని నిరూపించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక యాత్ర ఎందుకు అంటే.. ఇలా యాత్రలు చేసిన వారికి అధికార ఫలం దక్కుతుందన్న భావనతోనే అంటున్నారు. నిన్న కాక మొత్త బతుకమ్మ సందర్భంగా తన తండ్రి సొంత ఊరు చింతమడకలో కవిత కన్నీటిపర్యంతమై భావోద్వేగంతో చేసిన ప్రసంగంలో.. మాజీ మంత్రి హరీష్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఇక ఇప్పుడు తన యాత్రలో కూడా అదే చేయనున్నారు. కుటుంబం నుంచి తనను వేరు చేశారన్న సెంటిమెంట్ పండంతో పాటు.. ఉభయతారకంగా యాత్ర సెంటిమెంటు కూడా పండుతుందని కవిత చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే యాత్ర సెంటిమెంటు అందరికీ వర్తిస్తుందని కాదు. ఇక్కడా షరతులు వర్తిస్తాయ్. ఇంత వరకూ కేవ’లం అన్న’లకే ఈ సెంటిమెంటు వ’ర్క’వుట్ అయ్యింది. చెల్లెళ్లకు కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. జగన్, షర్మిళ ఇద్దరూ యాత్రలు చేశారు. కానీ అధికారం జగన కే దక్కింది. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? లేక కవితకు కలిసివస్తుందా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.
